రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-01-25T05:26:57+05:30 IST

కెల్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ కార్యకర్త కొలుకులూరి వెంకటసూర్యనారాయణ (52) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గుర్ల, జనవరి 24: కెల్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ కార్యకర్త కొలుకులూరి వెంకటసూర్యనారాయణ (52) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. అచ్చుతాపురం గ్రామంలో శనివారం జరిగిన పార్టీ సమావేశం లో ఆయన పాల్గొని, సాయంత్రం తన స్వగ్రామా నికి బైకుపై వస్తున్నారు. మండల కేంద్రం చుక్కపేట జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి బైకు అదుపుతప్పి పడిపోయింది. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే కారులో విజయనగరం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అత్య వసర వాహనంపై విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆదివారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైసీపీ నేత కేవీ సూర్యనారాయణరాజు, టీడీపీ నేత కిమిడి నాగార్జున, మండల నాయకుడు వెన్నె సన్యాసినాయుడు, చీపురుపల్లి, గరివిడి నేతలు విశాఖపట్టణం చేరుకుని కుటుంబీకులను పరామర్శించారు.  

 

Updated Date - 2021-01-25T05:26:57+05:30 IST