రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ABN , First Publish Date - 2021-01-16T05:47:03+05:30 IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ఆమనగల్లు: మండల పరిధి రాంనుంతల గేటు సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్కల్‌పహడ్‌ గ్రామానికి చెందిన మైనారపు సుధాకర్‌(23) మృతి చెందాడు. ఆటోడ్రైవర్‌ సుధాకర్‌ సొంత పనిమీద ఆమనగల్లుకు వచ్చి బైక్‌పై తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న కారు బైక్‌ను ఢీకొంది. దీంతో సుధాకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య లలిత ఉన్నారు. తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధర్మేష్‌ తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ప్రజాప్రతినిధులు పరామర్శించారు. 

Updated Date - 2021-01-16T05:47:03+05:30 IST