రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-09-25T09:45:30+05:30 IST
మండలంలోని కదిరి ప్రధాన రహదారిలో కోరేవాండ్లపల్లి వద్ద ద్విచక్రవాహనం, బస్సు ఢీకొ న్న ప్రమాదంలో మర్రిమాను కిష్టప్ప(40) గురువారం రాత్రి మరణించాడు.
గోరంట్ల, సెప్టెంబరు 24: మండలంలోని కదిరి ప్రధాన రహదారిలో కోరేవాండ్లపల్లి వద్ద ద్విచక్రవాహనం, బస్సు ఢీకొ న్న ప్రమాదంలో మర్రిమాను కిష్టప్ప(40) గురువారం రాత్రి మరణించాడు. ఓడీసీ మండలం చౌడంపల్లికి చెం దిన కిష్టప్ప, గో రంట్ల మండలంలోని బూదిలివాండ్లపల్లి లో వివాహం చేసుకొన్నారు. అత్తగారింటికి వచ్చిన అత ను ద్విచక్రవాహనంలో కుమారుడు రవితో కలిసి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
ఓ ప్రైవేట్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో కిష్టప్ప అక్కడికక్కడే మరణించాడు. కుమారుడు రవి స్వల్పంగా గాయపడ్డాడు. సీఐ జయనాయక్ సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదుచేసుకున్నారు.