ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-07-25T04:24:46+05:30 IST

ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెం దాడు.

ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

ధరూరు, జూలై 24: ద్విచక్రవాహనం  ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెం దాడు. ఈ ఘటన అల్వాల్‌పాడు గ్రామ సమీపంలో శనివారం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన కుర్వ రాముడు దుకాణంలో మటన్‌ తీసుకుని ఇంటికి వెళ్తుండగా, కేటీదొడ్డి మండలం, నందిన్నె గ్రామానికి చెందిన తెలుగు నరేష్‌ ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. దాంతో అక్కడికక్కడే కుర్వ రాముడు మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో ఎస్సై రాము సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-07-25T04:24:46+05:30 IST