రైల్వేగేటును ఢీకొట్టి వ్యక్తి దుర్మరణం

ABN , First Publish Date - 2021-06-18T05:36:08+05:30 IST

రైల్వేగేటును ఢీకొట్టి వ్యక్తి దుర్మరణం

రైల్వేగేటును ఢీకొట్టి వ్యక్తి దుర్మరణం

మర్పల్లి : మర్పల్లి మండల కేంద్రానికి చెందిన పబ్బె జయరాజ్‌ (27) బుధవారం రాత్రి 8 గంటల సమయంలో సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న తన భార్యను చూసేందుకు బైక్‌పై వెళుతుండగా మర్పల్లి రైల్వేగేటు వద్ద గేటును ఢీ కొట్టాడు. దీంతో తలకు, ఛాతికి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడని మర్పల్లి ఎస్‌ఐ వెంకటశ్రీను తెలిపారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-06-18T05:36:08+05:30 IST