రాజీవ్‌ రహదారిపై కారు ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-01-29T05:20:47+05:30 IST

ఒంటిమామిడి రాజీవ్‌ రహదారి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

రాజీవ్‌ రహదారిపై కారు ఢీకొని వ్యక్తి మృతి

ములుగు, జనవరి 28: ఒంటిమామిడి రాజీవ్‌ రహదారి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ రంగకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ఒంటిమామిడి రాజీవ్‌ రహదారిపై ఓ ధాబాలో పనిచేస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నూరుల్‌కాన్‌(35)  రాజీవ్‌ రహదారిపై నడుచుకుంటూ ఒంటిమామిడి వైపు బయలుదేరాడు. అదేసమయంలో కొండపాక గ్రామానికి చెందిన గడిల రమణారెడ్డి కారులో హైదరాబాద్‌ వైపు వెళ్తూ నూరుల్‌ఖాన్‌ను వెనక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో నూరుల్‌ఖాన్‌ తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే చికిత్స నిమిత్తం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నూరుల్‌ఖాన్‌ మరణించినట్టు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రమణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంగకృష్ణ తెలిపారు.  

Updated Date - 2022-01-29T05:20:47+05:30 IST