దంపతుల మధ్య తగాదాలు.. ఉరేసుకున్న భర్త

ABN , First Publish Date - 2021-05-13T16:50:47+05:30 IST

కుటుంబసభ్యులతో గొడవపడి పెయింటర్‌గా పనిచేస్తున్న

దంపతుల మధ్య తగాదాలు.. ఉరేసుకున్న భర్త

హైదరాబాద్/అంబర్‌పేట : కుటుంబసభ్యులతో గొడవపడి పెయింటర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉండే నాగరాజు(37) పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లావణ్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారితో పాటు అతని తల్లి కూడా వారితోనే ఉంటుంది. అయితే నాగరాజు అప్పుడప్పుడు మద్యం సేవించేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య తగాదాలు జరిగేవి. ఈ క్రమంలో ఈనెల 12న డబ్బుల కోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తన భార్యను, తల్లిని ఇంట్లోనుంచి బయటకు పంపి గది తలుపులుపెట్టుకున్నాడు.


తలుపు తెరుస్తారని వారు చాలా సేపు ఎదురుచూసినా తలుపు తెరవకపోవడంతో కిటికీలోనుంచి చూడగా ఆయన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికుల సహకారంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా అప్పటికే నాగరాజు మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-13T16:50:47+05:30 IST