Madhya Pradesh: తనపై కేసు పెట్టిన యువతిపై పగ.. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-08-04T02:36:40+05:30 IST

ఆ యువకుడు రెండేళ్ల క్రితం మాయ మాటలు చెప్పి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు..

Madhya Pradesh: తనపై కేసు పెట్టిన యువతిపై పగ.. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే..

ఆ యువకుడు రెండేళ్ల క్రితం మాయ మాటలు చెప్పి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.. ఆ యువకుడు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు.. తనపై కేసు పెట్టిన అమ్మాయిని వెతికి పట్టుకున్నాడు.. కత్తి చూపించి బెదిరించి ఆమెపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ ఘటనను స్నేహితుడి చేత వీడియో తీయించాడు.. 


ఇది కూడా చదవండి..

Bihar: మరిదితో లవ్ అఫైర్.. భర్తను అడ్డు తప్పించేందుకు ఆమె ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేసిందంటే..


మధ్యప్రదేశ్ (Madhya pradesh)లోని జబల్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడు రెండేళ్ల క్రితం తన ఇంటి దగ్గర ఉండే ఓ బాలికకు మాయ మాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మధ్యనే ఆ యువకుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. బయటకు వచ్చి తనపై కేసు పెట్టిన అమ్మాయిని వెతికి పట్టుకున్నాడు. మరో స్నేహితుడితో కలసి ఆ అమ్మాయి ఇంట్లోకి ప్రవేశించాడు. కత్తి చూపించి బెదిరించి ఆమెపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన మొత్తాన్ని తన స్నేహితుడి చేత వీడియో తీయించాడు. 


ఎవరికైనా చెబితే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించాడు. అలాగే గతంలో తనపై పెట్టిన కేసును కూడా వెనక్కి తీసుకోవాలని బెదిరించాడు. దీంతో ఆ బాలిక సైలెంట్‌గా ఉండిపోయింది. కూతురి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు నిలదీయగా ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-08-04T02:36:40+05:30 IST