అధికారుల కళ్లుగప్పి మూడు నెలలుగా ఎయిర్‌పోర్టులోనే.. అమెరికాలో..

ABN , First Publish Date - 2021-01-19T02:00:01+05:30 IST

అమెరికాలో గత మూడు నెలలుగా ఎయిర్ పోర్టులోనే ఉంటూ వస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చికాగోకు చెందిన ఆదిత్య సింగ్(36) అనే వ్యక్తి మూడు నెలల పాటు చికాగో

అధికారుల కళ్లుగప్పి మూడు నెలలుగా ఎయిర్‌పోర్టులోనే.. అమెరికాలో..

చికాగో: అమెరికాలో గత మూడు నెలలుగా ఎయిర్ పోర్టులోనే ఉంటూ వస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చికాగోకు చెందిన ఆదిత్య సింగ్(36) అనే వ్యక్తి మూడు నెలల పాటు చికాగోలోని ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఉంటున్నాడు. తాజాగా ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఆదిత్య సింగ్ గురించి తెలియడంతో అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కొవిడ్-19 వల్ల తనకు వేరే ప్రదేశానికి వెళ్లేందుకు భయం కలిగిందని, ఈ కారణంగానే ఎయిర్‌పోర్టులో ఉంటూ వచ్చినట్టు నిందితుడు చెప్పాడని అధికారులు పేర్కొన్నారు. 


ఎయిర్ పోర్టులోని నిషేధిత ప్రాంతంలో ఇంతకాలం పాటు అక్రమంగా జీవిస్తూ వచ్చినందుకు ఆదిత్య సింగ్‌పై పలు కేసులను అధికారులు నమోదు చేశారు. కాగా.. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. మరోపక్క అమెరికా జనాభాలో 3.2 శాతం మంది ఇప్పటికే వ్యాక్సిన్ డోస్‌ను కూడా తీసుకున్నారు. 

Updated Date - 2021-01-19T02:00:01+05:30 IST