స్నేహితులతో గడపాలంటూ భార్యపై ఒత్తిడి.. భర్తపై కేసు!

ABN , First Publish Date - 2020-08-04T03:49:19+05:30 IST

తన స్నేహితులతో సరసాలాడాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడో ఘనుడు.

స్నేహితులతో గడపాలంటూ భార్యపై ఒత్తిడి.. భర్తపై కేసు!

అహ్మదాబాద్: తన స్నేహితులతో సరసాలాడాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడో ఘనుడు. ఇలా చేస్తే వారి భార్యలతో తను కూడా సరదాగా గడపే అవకాశం దొరుకుతుందని ఆమెకు చెప్పాడు. ఈ నీచమైన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. స్థానికంగా నివశించే ఓ 43ఏళ్ల మహిళ ఈ విషయాన్ని పోలీసుల ముందుంచింది. కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్న ఆమె.. అంతటితో ఆగకుండా తన మగ స్నేహితులతో సరసాలాడాలని భర్త ఒత్తిడి చేస్తున్నాడని చెప్పింది. అలా చేస్తే ఆ మిత్రుల భార్యలతో సరదాగా గడపడానికి ఆ స్నేహితులు ఒప్పుకున్నారని, అందుకే భర్త తనపై ఒత్తిడి తెచ్చాడని వెల్లడించింది. ఈ బాధ భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోతానని చెప్పి, తన నగలు ఇచ్చేయమంటే భర్త కుటుంబం నిరాకరిస్తోందని వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-04T03:49:19+05:30 IST