భార్యాభర్తల మధ్య గూగుల్ చిచ్చు!

ABN , First Publish Date - 2020-05-21T23:14:20+05:30 IST

ఓ భర్త ఎదుర్కొన్న విపత్కర పరిస్థితి ఇది.

భార్యాభర్తల మధ్య గూగుల్ చిచ్చు!

చెన్నై: ఓ భర్త ఎదుర్కొన్న విపత్కర పరిస్థితి ఇది. తమిళనాడులోని మైలాదుతురాయ్‌కి చెందిన ఆర్. చంద్రశేఖర‌న్ అనే వ్యక్తి ఇటీవల గూగుల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తన కాపురంలో కలతలకు కారణమైన సదరు సంస్థపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరాడట. ప్రతి రోజు తాను ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక భార్య తన ఫోన్ చెక్ చేసి తాను ఆ రోజు ఎక్కడెక్కడికెళ్లిందీ తెలుసుకుంటుందని అతడు పోలీసులకు చెప్పాడట. అయతే మే 20న మాత్రం తాను వెళ్లని ప్రాంతాలకు కూడా వెళ్లినట్టు గూగుల్ మ్యాప్స్‌లో రికార్డైందని చంద్రశేఖరన్ పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడని సమాచారం. దీని వల్ల తన కాపురంలో కలతలు రేగాలయని ఆగ్రహం వ్యక్తం చేసిన అతడు గూగుల్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడట. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకోలేదని సమాచారం. ముందుగా ఈ ఘటన నిజానిజాలను నిర్ధారించుకునే పనిలో పడ్డారట స్థానిక పోలీసులు. 


Updated Date - 2020-05-21T23:14:20+05:30 IST