పుష్కరిణిలో పడి వ్యక్తి..

ABN , First Publish Date - 2022-07-04T05:46:26+05:30 IST

పుష్కరిణిలో పడి వ్యక్తి..

పుష్కరిణిలో పడి వ్యక్తి..

మహేశ్వరం, జూలై 3: ప్రమాదవశాత్తు పుష్కరిణిలో పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మహేశ్వరం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. మల్కాజిగికి చెందిన శ్రీనివాస్‌(44) జీవనోపాధి నిమిత్తం మహేశ్వరానికి వచ్చాడు. మండల కేంద్రంలోని శివగంగ ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు పుష్కరిణిలో పడిపోయి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2022-07-04T05:46:26+05:30 IST