తండ్రిని చంపేసిందంటూ మహిళపై కేసు పెట్టిన కుమారుడు.. దర్యాప్తులో షాకింగ్ నిజం వెలుగులోకి

ABN , First Publish Date - 2022-05-03T08:58:08+05:30 IST

తన తండ్రిని హత్య గురయ్యాడని ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ హత్య ఒక మహిళ చేసిందని అనుమానం వ్యక్తం చేశాడు. ఆ మహిళతో తన తండ్రి సహజీవనం చేస్తున్నాడని కూడా తెలిపాడు...

తండ్రిని చంపేసిందంటూ మహిళపై కేసు పెట్టిన కుమారుడు.. దర్యాప్తులో షాకింగ్ నిజం వెలుగులోకి

తన తండ్రిని హత్య గురయ్యాడని ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ హత్య ఒక మహిళ చేసిందని అనుమానం వ్యక్తం చేశాడు. ఆ మహిళతో తన తండ్రి సహజీవనం చేస్తున్నాడని కూడా తెలిపాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే ఆ మహిళను అరెస్టు చేశారు. అలాగే మరో నలుగురిపై అనుమానం వెలిబుచ్చాడా కుమారుడు. అయితే దర్యాప్తులో మాత్రం పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూశాయి. ఈ ఘటన బిహార్‌లోని ముంగేర్ ప్రాంతంలో జరిగింది. 


ముంగేర్‌లో నివసించే సంజయ్ మండల్ (52) అనే వ్యక్తి భార్య ఆరేళ్ల క్రితం అగ్నిప్రమాదంలో కన్నుమూసింది. అనంతరం పూనమ్ దేవి అనే మహిళతో సంజయ్ సహజీవనం ప్రారంభించాడు. ఈ విషయం అతని కుమారుడు సత్యవీర్ కుమార్‌కు నచ్చలేదు. పూనమ్ దేవి వచ్చిన తర్వాత మిగతా కుటుంబ సభ్యులను సంజయ్ పట్టించుకోవడం లేదని, ఆస్తులన్నీ అమ్మేసి ఆమెకే పెడుతున్నాడని ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో పథకం వేసిన సత్యవీర్.. ముగ్గురు నిందితులకు(కిరాయి హంతకులకు) రూ.70 వేలు సుపారీ ఇచ్చి తండ్రిని హతమార్చాలని చెప్పాడు. ఆ ముగ్గురూ ఏప్రిల్ 24న సంజయ్ నిద్రపోతుండగా పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. 


అనంతరం పూనమ్ దేవి, ముగ్గురు హంతకులపై సత్యవీర్ కేసు పెట్టాడు. అయితే దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. సత్యవీర్‌తోపాటు ముగ్గురు నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని త్వరలోనే మిగతా ఇద్దరిని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


Read more