వివాహితతో సంబంధం పెట్టుకున్న యువకుడు.. ఆమె తనను సరిగా పట్టించుకోవడం లేదని ఎంత దారుణానికి తెగించాడంటే..
ABN , First Publish Date - 2022-05-24T09:15:33+05:30 IST
తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి.. ఇప్పుడు తనను పట్టించుకోకపోవడంతో లేదని ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు...
తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి.. ఇప్పుడు తనను పట్టించుకోకపోవడంతో లేదని ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని సాగర్పుర్లో వెలుగు చూసింది.
స్థానికంగా డ్రైవర్గా పనిచేసే భరత్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పెళ్లైన యువతి ఆరతీ దేవి (28)తో భరత్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలం వీళ్లిద్దరూ బాగానే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆరతీ దేవి ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనను సరిగా పట్టించుకోవడం లేదని భరత్ భావించాడు. దీంతో కోపం తెచ్చుకున్న అతను కత్తితో ఆరతీపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను భర్తే స్థానికంగా ఉన్న దీన్దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికీ మరణించినట్లు వెల్లడించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. ఆరతీ భర్త వాంగ్మూలం ప్రకారం భరత్పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా తనే ఈ హత్య చేసినట్లు భరత్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని కూడా వాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.