ప్రియుడితో హోటల్‌లో ఉండగా వేరే వ్యక్తి నుంచి వరుసగా ఫోన్ కాల్స్.. అనుమానించి ప్రియుడు ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2022-03-08T05:36:32+05:30 IST

నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న యువతి తనను మోసం చేసిందని అనుమానించాడు. ఆమె వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా అతను వినలేదు. తీవ్ర ఆగ్రహంతో ఆమెను కొట్టాడు. తల నేలకు బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది

ప్రియుడితో హోటల్‌లో ఉండగా వేరే వ్యక్తి నుంచి వరుసగా ఫోన్ కాల్స్.. అనుమానించి ప్రియుడు ఎంత పని చేశాడంటే..

నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న యువతి తనను మోసం చేసిందని అనుమానించాడు. ఆమె వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా అతను వినలేదు. తీవ్ర ఆగ్రహంతో ఆమెను కొట్టాడు. తల నేలకు బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. షాక్‌కు గురైన ప్రియుడు అక్కణ్నుంచి తప్పించుకుని వేరే రాష్ట్రానికి పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌‌లో ఈ ఘటన జరిగింది. 



ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన శివమ్ చౌహాన్ అనే వ్యక్తి ఉద్యోగ నిమిత్తం ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. ఆ క్రమంలో అక్కడ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్లుగా వీరి ప్రేమాయణం సాగుతోంది. కాగా, వీరిద్దరూ గత నెల 27న ఢిల్లీలోని ఓ హోటల్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఆ యువతికి వేరే యువకుడి నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ గురించి శివమ్ ఆరా తీశాడు. ఆ యువతి చెప్పిన మాటలను నమ్మలేదు. 


ఆమె అబద్ధాలు చెబుతున్నట్టు గ్రహించి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన శివమ్ ఆమెను గట్టిగా కొట్టాడు. ఆమె తల నేరుగా నేలకు తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె అక్కడికక్కడే మరణించింది. శివమ్ వెంటనే అక్కణ్నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామంలో శివమ్‌ను అరెస్ట్ చేశారు. 


Updated Date - 2022-03-08T05:36:32+05:30 IST