కిచిడీలో ఉప్పు కాస్త ఎక్కువ వేయడమే ఆమె చేసిన తప్పు.. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త చివరికి ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2022-04-17T21:37:36+05:30 IST
వంటలో ఉప్పు, కారం కాస్త అటూ ఇటూ అవడం సహజమే. అది పెద్ద తప్పే కాదు. పని ఒత్తిడిలోనో లేక ఇతర కారణాల వల్లో తెలియదు కానీ ఓ మహిళ ఈ పొరపాటు చేసింది. అదే ఆమెకు శాపంగా మారింది. తీవ్ర ఆగ్రహం
ఇంటర్నెట్ డెస్క్: వంటలో ఉప్పు, కారం కాస్త అటూ ఇటూ అవడం సహజమే. అది పెద్ద తప్పే కాదు. పని ఒత్తిడిలోనో లేక ఇతర కారణాల వల్లో తెలియదు కానీ ఓ మహిళ ఈ పొరపాటు చేసింది. అదే ఆమెకు శాపంగా మారింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త.. దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. స్థానికంగా ప్రస్తుతం చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన 40ఏళ్ల నిర్మల.. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయాన్నే నిద్ర లేచి ఇంట్లో పని అంతా పూర్తి చేసింది. అనంతరం కుటుంబ సభ్యుల కోసం కిచిడీ వండింది. దాన్ని తన భర్తకు వడ్డించింది. అయితే అందులో ఉప్పు ఎక్కువైందని ఆమె భర్త నీలేశ్ ఘాఘ్ (46) ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్యపై దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా గొంతు నులిమి ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. నీలేశ్ ఘాఘ్పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే.. గురువారం థానే జిల్లాలోని రబోడిలో ఓ వ్యక్తి టిఫిన్ పెట్టలేదని కోడలిని తుపాకీతో కాల్చి చంపేశాడు.