సాయంత్రం అయినా తెరచుకోని ఆ ఇంటి తలుపులు.. అనుమానంతో ఓ వ్యక్తి వెళ్లి కిటికీలోంచి తొంగి చూస్తే..

ABN , First Publish Date - 2022-07-23T19:52:43+05:30 IST

నిత్యం పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండేవారు. కానీ ఆ రోజు మాత్రం వాళ్ల హడావిడి లేదు. ఆ ఇంటి తలుపులు కూడా ఉదయం నుంచి తెరుచుకులేదు. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందో అని అనుమానం వ్యక్తం చేస్తూ.. సాయంత్రం వేళ ఆ ఇంటి వైపు వెళ్లారు. కిటికీలోంచి తొంగి

సాయంత్రం అయినా తెరచుకోని ఆ ఇంటి తలుపులు.. అనుమానంతో ఓ వ్యక్తి వెళ్లి కిటికీలోంచి తొంగి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: నిత్యం పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండేవారు. కానీ ఆ రోజు మాత్రం వాళ్ల హడావిడి లేదు. ఆ ఇంటి తలుపులు కూడా ఉదయం నుంచి తెరుచుకులేదు. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందో అని అనుమానం వ్యక్తం చేస్తూ.. సాయంత్రం వేళ ఆ ఇంటి వైపు వెళ్లారు. కిటికీలోంచి తొంగి చూశారు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి కంగుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. స్థానికంగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)కు చెందిన జితేంద్ర వాల్మికికి నిర్జల అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో గ్వాలియర్ (Gwalior) జిల్లాలోని మహరాజ్‌పురా‌లో నివసిస్తున్న ఈ దంపతులు బాబు, కూతురుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం బాబు వయసు 4సంవత్సరాలు కాగా.. కూతురు వయసు ఏడాదిన్నర. ఈ ఇద్దరు పిల్లలూ ప్రతి రోజూ ఇంటి మందు ఉన్న ఖాళీ స్థలంలో ఆటలాడుకునే వాళ్లు. కానీ శుక్రవారం మాత్రం పిల్లల హడావిడినీ స్థానికులు గుర్తించలేదు. అంతేకాకుండా జితేంద్ర ఇంటి తలుపులు కూడా సాయంత్రం వరకూ మూసే ఉండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలోనే ఇంటి వద్దకు వెళ్లి, ఏం జరిగిందో తెలుసుకునేందకు కిటికీలోంచి లోనికి తొంగి చూశారు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యారు. 



జితేంద్ర కుటుంబ సభ్యులు నిర్జీవులుగా ఉండటాన్ని చూసి పోలీసుల(Police)కు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. స్థానికంగా ఉన్న స్కూల్‌లో కొన్ని నెలల క్రితమే జితేంద్ర స్వీపర్‌గా జాయిన్ అయ్యాడని చెప్పారు. గురువారం రాత్రి ఆర్థిక కారణాల వల్ల ఇంట్లో గొడవ జరిగిందని.. ఈ నేపథ్యంలోనే జితేంద్ర దారణమైన నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నామన్నారు. తొలుత భార్యను ఆ తర్వాత పిల్లలను హత్య చేసి, తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్టు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు పేర్కొన్నారు. కాగా.. స్థానికంగా ఈ ఘటన హాట్ టాపిక్ అయింది. 


Updated Date - 2022-07-23T19:52:43+05:30 IST