పెళ్లయిన కొన్ని రోజులకు పరారైన భర్త.. ఆరేళ్ల తర్వాత ఒక్కసారిగా ఏ స్థితిలో కనిపించాడంటే..

ABN , First Publish Date - 2022-06-01T08:45:02+05:30 IST

పెళ్లి చేసుకొని మెట్టినింటికి వచ్చిన ఒక యువతికి కొన్ని రోజులకే షాక్ తగిలింది. భర్త ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పారిపోయాడు. అతని కోసం ఎంత గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటన జరిగిన ఆరేళ్ల తర్వాత అతను ఊళ్లో కనిపించాడని తెలియడంతో ఆమె ఆగ్రహం ఆపుకోలేకపోయింది...

పెళ్లయిన కొన్ని రోజులకు పరారైన భర్త.. ఆరేళ్ల తర్వాత ఒక్కసారిగా ఏ స్థితిలో కనిపించాడంటే..

పెళ్లి చేసుకొని మెట్టినింటికి వచ్చిన ఒక యువతికి కొన్ని రోజులకే షాక్ తగిలింది. భర్త ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పారిపోయాడు. అతని కోసం ఎంత గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటన జరిగిన ఆరేళ్ల తర్వాత అతను ఊళ్లో కనిపించాడని తెలియడంతో ఆమె ఆగ్రహం ఆపుకోలేకపోయింది. దానికితోడు అతను వేరే వివాహం కూడా చేసుకున్నట్లు తెలియడంతో.. తల్లిదండ్రులతో కలిసి అతను ఉన్న ప్రాంతానికి చేరుకొని చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జరిగింది. 


మహీ అనే యువతికి ఆరేళ్ల క్రితం ఒక వ్యక్తితో పెళ్లయింది. అతను పెళ్లి జరిగిన కొన్ని రోజులకే పారిపోయాడు. వేరే యువతిని పెళ్లి చేసుకొని కాపురం పెట్టాడు. అతని కోసం ఎంత గాలించినా ఎలాంటి వివరాలు తెలియలేదు. భర్త వెళ్లిపోయే సరికే గర్భవతి అయిన మహీ.. అదే ఏడాదిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ పాప వయసు ఐదేళ్లు.. ఇప్పుడు తన భర్త వేరే మహిళను వివాహం చేసుకున్నాడని తెలియడంతో మహీ ఆగ్రహంతో ఊగిపోయింది. 


అతను ఊళ్లోకి వచ్చినట్లు తెలిసి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు చేరుకుంది. ఆమెను చూడగానే.. సదరు భర్తతో పాటు ఉన్న వ్యక్తి ముందుగా దాడి చేశాడు. దాంతో రెండు వర్గాల మధ్య తన్నులాట జరిగింది. మధ్యలో హోంగార్డులు వచ్చి ఆపేందుకు ప్రయత్నించినా వాళ్లు ఆగలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట కూడా తెగ వైరల్ అయింది.

Updated Date - 2022-06-01T08:45:02+05:30 IST