చంపావతినదిలో మునిగి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-07-01T05:48:15+05:30 IST

మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న దొడ్డిబాడువ సమీపంలోగల చంపావతినదిలో మునిగి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసు కుంది.

చంపావతినదిలో మునిగి వ్యక్తి మృతి

 డెంకాడ: మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న దొడ్డిబాడువ సమీపంలోగల చంపావతినదిలో మునిగి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసు కుంది. డెంకాడ ఎస్‌ఐ ఎన్‌.పద్మావతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగ రంలోని కొత్తపేట కుమ్మరివీధికి చెందిన ఎ.శ్రీనివాసరావు(47) గురువారం తమ స్నేహితులతో కలిసి సరదాగా చంపావతి నదీ తీర ప్రాంతానికి వచ్చాడు. ఈత కొడదామని ఆలోచనతో చంపావతి నదిలోకి దిగాడు. అయితే అతనికి ఈత రాకపో వడంతో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులకు కూడా ఈత రాకపోవడంతో కాపాడలేకపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రా సుపత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాసరావు విజయనగరంలో వండ్రంగిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ పద్మావతి తెలిపారు.

 

Updated Date - 2022-07-01T05:48:15+05:30 IST