ప్రేయసి పెళ్లి చేసుకుందనే కోపంతో ఆ యువకుడు ఎంత దారుణానికి తెగించాడంటే.. ఊరేగింపు పైకి కారుతో దూసుకెళ్లి..

ABN , First Publish Date - 2022-02-25T05:47:21+05:30 IST

అతను 9వ తరగతి నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.. పెళ్లి చేసుకుంటానని ఆమె వెంటబడ్డాడు. అయితే ఆ యువతి అతడి ప్రేమను అంగీకరించలేదు.. వేరే యువకుడిని వివాహం చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన అతను ఆమె భర్తను చంపేందుకు ప్రయత్నించాడు..

ప్రేయసి పెళ్లి చేసుకుందనే కోపంతో ఆ యువకుడు ఎంత దారుణానికి తెగించాడంటే.. ఊరేగింపు పైకి కారుతో దూసుకెళ్లి..

అతను 9వ తరగతి నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.. పెళ్లి చేసుకుంటానని ఆమె వెంటబడ్డాడు. అయితే ఆ యువతి అతడి ప్రేమను అంగీకరించలేదు.. వేరే యువకుడిని వివాహం చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన అతను ఆమె భర్తను చంపేందుకు ప్రయత్నించాడు.. ఊరేగింపులో ఉన్న వరుడి కారును ఓ జీప్‌తో ఢీకొట్టాడు.. ఆ ప్రమాదంలో వరుడి తల్లి మరణించింది. 


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని భన్‌స్వారాకు చెందిన రామచంద్ర అనే యువకుడు తొమ్మిదో తరగతి నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె చదివే కాలేజీలో చేరాడు. పలుమార్లు ఆమెకు తన ప్రేమ గురించి చెప్పినా.. యువతి అతనంటే ఇష్టంలేదని చెప్పింది. కానీ రామచంద్ర ఆమెనే పెళ్లి చేసుకుందామనుకున్నాడు. పంకజ్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. దీంతో ప్రేయసి భర్తను చంపాలని రామచంద్ర నిర్ణయించుకున్నాడు. వివాహం తర్వాత పెళ్లిపందిరిలో వరుడు పంకజ్ ఊరేగింపు కోసం కారు వద్దకు వెళుతుండగా.. అదే సమయంలో రామచంద్ర ఒక జీపుతో కారుని ఢీకొట్టాడు. 


ఈ  ఘటనలో వరుడు గాయాలపాలు కాగా.. వరుడి తల్లి ఆస్పత్రకి వెళ్లే మార్గంలో మరణించింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  రామచంద్ర నడపిన జీప్‌ అతను దొంగతనం చేసి తీసుకువచ్చాడని పోలీసుల విఛారణలో వెల్లడైంది.


Updated Date - 2022-02-25T05:47:21+05:30 IST