పాముకాటుతో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-17T05:04:37+05:30 IST
మండలంలోని సూరపురాజుపల్లె పంచాయతీలో శుక్రవారం ఉదయం పాముకాటుతో వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ పెద్ద ఓబన్న తెలిపారు.
రైల్వేకోడూరు రూరల్, ఏప్రిల్ 16: మండలంలోని సూరపురాజుపల్లె పంచాయతీలో శుక్రవారం ఉదయం పాముకాటుతో వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ పెద్ద ఓబన్న తెలిపారు. ఆయన వివరాలు మేరకు సూరపురాజుపల్లెకు చెందిన గంగరాజు చెంగల్రాజు (56) పొలానికి వెళ్లి పనిచేస్తుండగా పాము కరిచింది. అక్కడే పొలం పని చేసుకుంటున్న స్థానికులు వెంటనే రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రఽథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందినట్లు ఎస్ఐ పెద్ద ఓబన్న తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు