మద్యం మత్తులో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-17T04:23:29+05:30 IST

మద్యం మత్తులో వ్యక్తి మృతి

మద్యం మత్తులో వ్యక్తి మృతి

రణస్థలం: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం నక్కపల్లి గ్రామానికి చెందిన బి.చిట్టిబాబు అనేవ్యక్తి మద్యం మత్తులో ఆదివారం మృతి చెందినట్లు జేఆర్‌పురం ఎస్‌ఐ కంది వాసునారాయణ తెలిపారు. రణస్థలానికి సమీపంలో ఉన్న మద్యం దుకాణం వద్ద మధ్యాహ్నం మద్యం సేవించి సకాలంలో నీరు అందకపోవడంతో చిట్టిబాబు మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

Updated Date - 2021-05-17T04:23:29+05:30 IST