రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ABN , First Publish Date - 2022-08-13T05:49:11+05:30 IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

పాలకొండ (వీరఘట్టం): కడకెల్ల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరఘట్టానికి చెందిన పారాది శంకరరావు(48) అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య కృష్ణవేణి, కుమారుడు గణేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మక్కువలో జరిగిన శుభకార్యక్రమానికి ద్విచక్రవాహనంపై వెళ్లిన వీరు స్వగ్రామానికి వస్తుండగా కడకెల్ల వద్ద రోడ్డు పక్కన ఉన్న దమ్ము ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో పార్వతీపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూడా మరో ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం వెనుకన కూర్చొన్న శంకరరావు అక్కడికక్కడే మృతి చెందగా, కృష్ణవేణి, గణేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాత్రులను మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం శంకరరావు మృతదేహానికి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. 

Updated Date - 2022-08-13T05:49:11+05:30 IST