విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కులకచర్ల, జూలై 2 : చౌడాపూర్ మండలం విఠలాపూర్లో విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన అంజయ్య(35) శనివారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. పొలం గట్టుపై మోటర్ విద్యుత్ కేబుల్ వైర్లు పైకి తేలి ఉండటంతో.. అతడు గమనించకుండా వైర్లపై అడుగు వేయగా.. విద్యుత్షాక్తో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య వెంకటమ్మ, ముగ్గురు పిల్లలున్నారు. తండ్రి మాసయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీ్సలు తెలిపారు.
- ఉడిమేశ్వరంలో గేదె..
కొడంగల్ రూరల్, జూలై 2 : మేత కోసం వెళ్లిన ఓ గేదె విద్యుత్షాక్తో మృత్యువాత పడిన ఘటన మండల పరిధిలోని ఉడిమేశ్వరం గ్రామ శివారులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుర్వ మల్లప్ప తనకున్న గేదెలను రోజూమాదిరిగా మేత కోసం గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. ఈక్రమంలో ఓ గేదె మేత మేస్తుండగా అక్కడే తెగిపడి ఉన్న విద్యుత్ తీగకు తగిలింది. దీంతో విద్యుత్షాక్తో గేదే అక్కడిక్కడే మృతిచెందింది. గేదె విలువ దాదాపు రూ.50వేలు ఉంటుందని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.