వ్యక్తి ఉసురు తీసిన కరోనా తాడు..!
ABN , First Publish Date - 2020-03-28T15:30:25+05:30 IST
కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు గానూ గ్రామంలో ఇతరులెవరూ రావొద్దంటూ రోడ్డుకు అడ్డంగా కట్టిన తాడు ఓ వ్యక్తి పాలిట ఉరితాడైంది. వివరాల్లోకెళితే.. బాపట్ల మండలం పూండ్ల వద్ద రోడ్డుకు అడ్డంగా తాడు కట్టారు. అయితే ఆ తాడును
గుంటూరు: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు గానూ గ్రామంలో ఇతరులెవరూ రావొద్దంటూ రోడ్డుకు అడ్డంగా కట్టిన తాడు ఓ వ్యక్తి పాలిట ఉరితాడైంది. వివరాల్లోకెళితే.. బాపట్ల మండలం పూండ్ల వద్ద రోడ్డుకు అడ్డంగా తాడు కట్టారు. అయితే ఆ తాడును చూసుకోకుండా కూనపురెడ్డి సుబ్బారావు బైక్పై వెళ్లగా కింద పడిపోయాడు. ఆ సమయంలో తాడు అతని మెడకు చుట్టుకుని ఉరి బిగుసుకుంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బాపట్ల మండలం కొండుబొట్ల వారిపాలెం వాసిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.