రంగస్థల నటుడు వరప్రసాద్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-13T05:51:42+05:30 IST

ప్రముఖ రంగస్థల నటుడు టోపి సుమిత్రా వరప్రసాద్‌ (70) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.

రంగస్థల నటుడు వరప్రసాద్‌ మృతి

పాణ్యం, మే 12 : ప్రముఖ రంగస్థల నటుడు టోపి సుమిత్రా వరప్రసాద్‌ (70) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మండలంలోని కొండజూటూరు గ్రామానికి చెందిన సుమిత్ర దుర్యోధన ఏకపాత్రాభినయంలో ప్రముఖుడు. ఆయన  గతంలో సర్పంచ్‌గా పోటీ చేశారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె సంతానం. సుమిత్ర మృతిపట్ల ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, సర్పంచ్‌ సుజీత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసి సరళమ్మ, మాజీ సర్పంచ్‌లు గంగ నారాయణ, మేకల సుబ్బరాయుడు, మాల మహానాడు నాయకులు దేవదత్తు, శ్రీనివాసులు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-13T05:51:42+05:30 IST