కోత మిషన్‌ కింద నలిగి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-04-17T06:46:58+05:30 IST

కోత మిషన్‌ కింద నలిగి వ్యక్తి మృతి చెందాడు.

కోత మిషన్‌ కింద నలిగి వ్యక్తి మృతి

 వాహనాన్ని రివర్స్‌ తీస్తుండగా ఘటన

నేరేడుచర్ల, ఏప్రిల్‌ 16: కోత మిషన్‌ కింద నలిగి వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ యాదవేంద్రరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్ల మండలం పెంచికల్‌దిన్న గ్రామంలో కోత మిషన్‌ వరి పైరును కోస్తుండగా ఇదే గ్రామానికి చెందిన బుర్రి మట్టయ్య(45) చెట్టు కింద నిద్రిస్తున్నాడు. ధాన్యం డబ్బా నిండడంతో  కోత మిషన్‌ డ్రైవర్‌ ధాన్యాన్ని ట్రాక్టర్‌లో పోసేందుకు మిషన్‌ను రివర్స్‌ తీస్తుండగా ప్రమాదవ శాత్తు మట్టయ్య మీద నుంచి వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మట్టయ్యను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిస్తుండగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. మట్టయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-04-17T06:46:58+05:30 IST