గుంటూరు(AP):కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-16T16:18:01+05:30 IST

కుటుంబ కలహాల కారణంగా (Guntur)గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. మేడికొండూరు మండలం తురకాపాలెంలో షేక్ భరన్ చెక్క పని

గుంటూరు(AP):కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య

గుంటూరు(AP): కుటుంబ కలహాల కారణంగా (Guntur)గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. మేడికొండూరు మండలం తురకాపాలెంలో షేక్ భరన్ చెక్క పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తన భార్య ప్రవర్తన సరిగా లేదని, గత ఏడాది నుంచి తరుచూ మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుందని షేక్ భరన్ ఆరోపణ. ఆత్మహత్యకు ముందు షేక్ భరన్  సెల్ఫీ వీడియో తీసి అనంతరం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2022-05-16T16:18:01+05:30 IST