రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-25T05:25:04+05:30 IST
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
తాండూరు, మే, 24 : రైలుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తాండూరు రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి తాండూరు-మంతట్టి రైల్వే మార్గంలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వద్ద లభించిన ఆధారాల ప్రకారం.. తాండూరు పట్టణం ఇందిరానగర్కు చెందిన బాతుల గుండప్పగా గుర్తించారు. పోలీసులు కుటుంబికులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని రైల్వే పోలీసులు సాయంతో పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని రైల్వే పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
దోమ, మే 24 : రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడు మృతిచెందాడు. మండల పరిధిలోని దిర్సంపల్లికి చెందిన బైండ్ల యాదయ్య(24) ఈ నెల 14న స్వగ్రామం నుంచి హైదరాబాద్కు బైక్పై వెళ్తుండగా బ్రాహ్మణ్పల్లి సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు కుటుంబసభ్యులకు సమాచారం అందించగా పరిగి ఆసుపత్రికి, అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి యాదయ్య మృతిచెందాడు. మృతుడి తండ్రి నర్సింహులు మంగళవారం పోలీ్సలకు ఫిర్యాదు చేశాడు.