విషద్రావణం తాగి వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-30T05:48:48+05:30 IST

మండలంలోని చిన్నాయపల్లెకు చెందిన గుర్రాల శివారెడ్డ్డి(59) అనే రైతు విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విషద్రావణం తాగి వ్యక్తి ఆత్మహత్య

కాశినాయన జూన్‌ 29: మండలంలోని చిన్నాయపల్లెకు చెందిన గుర్రాల శివారెడ్డ్డి(59) అనే రైతు విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబీకుల వివరాల మేరకు... బుధవారం ఇంటి లో ఎవరూ లేనిసమయంలో శివారెడ్డ్డి  విషద్రావణం తాగాడు. గుర్తించిన స్థానికులు పోరుమామిళ్ళలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తరలిస్తుండగా మార్గమద్యలో చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్ల్లు, ఒక కుమారుడు ఉన్నారు. వ్యవసాయం మూలంగా కల్గిన ఆర్థిక ఇబ్బందులే మృతికి దారితీశాయని సమాచారం. ఈ విషయంపై ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా మృతిపై గ్రామస్తులు ఫోన్‌ ద్వారా తెలిపారని, పూర్తి వివరాలు అందాల్సి ఉందన్నారు.

 

Updated Date - 2022-06-30T05:48:48+05:30 IST