మైలవరంలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-19T23:43:19+05:30 IST
పట్టణంలోని ఆర్.సి రెసిడెన్సీ(లాడ్జి)లో గుర్తు తెలియని వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మైలవరం: పట్టణంలోని ఆర్.సి రెసిడెన్సీ(లాడ్జి)లో గుర్తు తెలియని వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జి సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లాడ్జికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ దొరికిన ఆధారాలతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని విజయవాడ నగరంలోని ఎల్ఐసీ కాలనీకి చెందిన వేగి చంద్రమౌళి(60)గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతుడి బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. చంద్రమౌళి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.
ఈ సందర్భంగా పట్టణంలోని లాడ్జిల నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు. లాడ్జికి వచ్చే ప్రతి వ్యక్తి వివరాలు తీసుకుని రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. వారి చిరునామా, ఆధార్ కార్డు జిరాక్స్, తదితర వివరాలను కచ్చితంగా తీసుకోవాలన్నారు. లాడ్జిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసులకు వెంటనే తెలియజేయాలన్నారు.