ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన అమ్మాయి.. అక్కడ జరిగింది దారుణం
ABN , First Publish Date - 2021-11-02T13:22:50+05:30 IST
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన అమ్మాయి.. అక్కడ జరిగింది దారుణం
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రలోని ఝాన్సీ నగరానికి చెందిన వాసవి(19, పేరు మార్చబడినది) పోలీసు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటోంది. వాసవికి స్నేహితులతో సరదగా గడపడమంటే ఇష్టం. కానీ పోలీసు ఉద్యోగం కోసం ట్రైనింగ్ తీసుకునేందుకు ఆమె మరోఊరు రావల్సి వచ్చింది. దీంతో ఆమెకు అక్కడ ఎవరూ స్నేహితులు లేరు. అందుకని సరదాగా ఫేస్బుక్లో చాటింగ్ చేసేది.
రెండు నెలల క్రితం వాసవి ఫేస్ బుక్ అకౌంట్కి ఒక యువకుడి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అతను మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరానికి చెందిన రాహుల్. వాసవి రాహుల్తో రోజూ చాటింగ్ చేసేది. అలా వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. తరుచూ ఫోన్లో కూడా మాట్లాడేవారు. వాసవి ఒకరోజు తన ఇంట్లో ఆర్థిక ఇబ్బుందుల సమస్య ఉందని.. అందుకే త్వరగా ఉద్యోగం వస్తే బాగుంటుందని చెప్పింది. కొన్నిరోజుల తరువాత రాహుల్ వాసవికి ఫోన్ చేశాడు. గ్వాలిర్లో ఒక ఉద్యోగం ఉందని, మంచి జీతం వస్తుందని చెప్పాడు. అందుకోసం వాసవి గ్వాలియర్లో ఇంటర్వ్యూకు రావల్సి ఉంటుందని అన్నాడు.
వాసవి రాహుల్ మాటలు నమ్మి తన చదువు సంబంధించిన సర్టిఫికెట్లన్నీ తీసుకొని గ్వాలియర్ చేరుకొంది. అక్కడ రాహుల్ ఆమెను తీసుకొని ఒక పెద్ద స్టార్ హోటల్ తీసుకెళ్లాడు. అక్కడ భోజనంలో మత్తు కలిపి ఇచ్చాడు. ఆ తరువాత వాసవిపై అత్యాచారం చేసి పొమ్మన్నాడు. వాసవి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి చేరుకొంది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేదు. కానీ ఆ బాధలో ఒక విషయం మరిచిపోయింది. రాహుల్ వద్ద తన సర్టిఫికెట్లు మరిచిపోయి వచ్చింది. మళ్లీ రాహుల్కు ఫోన్ చేసి తన సర్టిఫికెట్లను తిరిగివ్వమని అడిగింది. అప్పుడు రాహుల్ మరోసారి తన కోరికను తీర్చిచే తన సర్టిఫికెట్లను తిరిగి ఇచ్చేస్తానని పిలిచాడు.
వాసవి మరోసారి గ్వాలియర్ వెళ్లగా రాహుల్ ఆమెపై మళ్లీ అఘాయిత్యం చేసి.. సర్టిఫికెట్లు ఇవ్వకుండానే వెళ్లగొట్టాడు. దీంతో వాసవి తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాహుల్పై అత్యాచారం, బ్లాక్మెయిల్ నేరాల కింద కేసు నమోదు చేశారు. రాహుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.