రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లిన భార్య.. కాపురానికి రావాలంటే రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-12-29T09:16:09+05:30 IST

వివాహం జరిగి 15 రోజుల తరువాత రాఖీ పండుగ కోసం పుట్టింటికి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. చివరికి భర్త ఆమె కోసం అత్తారింటికి వెళ్లాడు. అప్పుడా అల్లుడికి అత్తమామలు చుక్కలు చూపించారు. అమ్మాయిని కాపురానికి పంపాలంటే రూ.5 లక్షలు ఇవ్వమని డిమాండ్...

రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లిన భార్య.. కాపురానికి రావాలంటే రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్. అసలేం జరిగిందంటే..

వివాహం జరిగి 15 రోజుల తరువాత రాఖీ పండుగ కోసం పుట్టింటికి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. చివరికి భర్త ఆమె కోసం అత్తారింటికి వెళ్లాడు. అప్పుడా అల్లుడికి అత్తమామలు చుక్కలు చూపించారు. అమ్మాయిని కాపురానికి పంపాలంటే రూ.5 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశారు. ఇంతకుముందే ఆ భర్త పెళ్లి కోసం వారికి రూ.3 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ రూ.5 లక్షలు అనగానే అతనికి చెమటలు పట్టాయి. ఏం చేయాలో తోచక.. చివరికి అతను పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ రాష్ట్రంలోని దుంగర్‌పూర్ గ్రామంలో నివసించే అటల్ బిహారి జైన్(29) అనే యువకుడు పెళ్లి చేసుకునేందుకు సంబంధాలు చూస్తూ ఉండగా.. గులాబ్ సింగ్ అనే ఒక పెళ్లిళ్ల ఏజెంట్  సోనా అనే అమ్మాయి ఫొటో తెచ్చాడు. సోనా అందానికి ఫిదా అయిన అటల్ బిహారి పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ సోనా తల్లి రేఖా దేవి, మేనమామ తిలక్ సింగ్  ఒక షరతు విధించారు. పెళ్లి చేయాలంటే.. రూ.3 లక్షలు వరుడు చెల్లించాలని. సోనా కోసం అటల్ బిహారి అందుకు ఒప్పుకున్నాడు. ఒక స్టాంప్ పేపర్‌పై రూ.3 లక్షలు చెల్లించినట్లు రాయించుకొని డబ్బు చెల్లించాడు. ఆ తరువాత వివాహం జరిగింది.


వివాహం జరిగినప్పటి నుంచి సోనా నెల పాటు వ్రతం అని భర్తకు దూరంగా ఉంది. ఈ క్రమంలో ఒక రోజు సోనా మేనమామ తిలక్ సింగ్ అటల్ బిహారి ఇంటికి వచ్చాడు. రాఖీ పండుగ కోసం సోనాను ఆమె పుట్టింటికి తీసుకు వెళతానని చెప్పాడు. అందుకు అటల్ బిహారి సరేనని భార్యను పుట్టింటికి పంపించాడు. రాఖీ పండుగ గడిచి కొన్ని రోజుల తరువాత వరకు సోనా తిరిగి రాకపోవడంతో అటల్ బిహారి ఆమె కోసం వెళ్లాడు. కానీ అక్కడ సోనా తల్లి రేఖ, మేనమామ తిలక్ సింగ్ అల్లుడితో అసభ్యంగా ప్రవర్తించారు. సోనాను తిరిగి కాపురానికి పంపాలంటే మరో రూ.5 లక్షలు చెల్లించమని అడిగారు. వారి మాటలకు ఆశ్చర్య పోయిన అటల్ బిహారి.. ఏం చేయాలో తెలియక తిరిగి ఇంటికి వచ్చాడు. మిత్రుడి సలహా మేరకు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అటల్ బిహారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోనా ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ ఎవరూ లేరు. అనుమానంతో పోలీసులు పెళ్లిళ్ల ఏజెంట్ గులాబ్ సింగ్‌ను అరెస్టు చేశారు. గులాబ్ సింగ్ చెప్పిన విషయాలు విన్న తరువాత అటల్ బిహారి, పోలీసులు షాక్‌కు గురయ్యారు. 


అసలు సోనా ఒక పెద్ద మోసగత్తె. ఆమె తన అందంతో డబ్బున్న వాళ్లను మెప్పించి.. పెళ్లి చేసుకొని ఆ తరువాత కొన్ని రోజులకు పెళ్లి కొడుకు వద్ద  డబ్బులు దోచుకొని అక్కడి నుంచి పారిపోతుంది. ఇదంగా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఇందులో సోనా తల్లి, మేనమామ అందరూ పాత్రధారులే. వారు అటల్ బిహారి లాంటి మృదుస్వభావి అయిన వ్యక్తులను టార్గెట్ చేస్తారు. 


గులాబ్ సింగ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు సోనా తల్లి, మేనమామగా నటించిన రేఖ, తిలక్ సింగ్‌ని పట్టుకొని అరెస్టు చేశారు. కానీ సోనా పరారీలో ఉంది. 

Updated Date - 2021-12-29T09:16:09+05:30 IST