భార్య మైనపు బొమ్మతో గృహప్రవేశం

ABN , First Publish Date - 2020-08-11T07:29:12+05:30 IST

శ్రీరాముడు స్వర్ణ సీతతో కలిసి అశ్వమేథ యాగం చేశాడట! నేడు ఓ సామాన్యుడు తన భార్యపై మమకారంతో ఆమె మైనపు బొమ్మతో గృహ ప్రవేశం చేశాడు...

భార్య మైనపు బొమ్మతో గృహప్రవేశం

శ్రీరాముడు స్వర్ణ సీతతో కలిసి అశ్వమేథ యాగం చేశాడట! నేడు ఓ సామాన్యుడు తన భార్యపై మమకారంతో ఆమె మైనపు బొమ్మతో గృహ ప్రవేశం చేశాడు. కర్ణాటకలోని కొప్పళ పట్టణానికి చెందిన శ్రీనివాస గుప్తా సతీమణి పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయినా కుటుంబ సభ్యులు ఆమెను మరచిపోలేదు. శ్రీనివాస గుప్తా కొప్పళలో సొంత ఇళ్లు కట్టుకున్నారు. గృహ ప్రవేశ సమయంలో బెంగళూరులోని కళాకారులను సంప్రదించి భార్య మైనపు విగ్రహం చేయించారు. జీవకళ ఉట్టిపడుతున్నట్లున్న విగ్రహంతో కలిసి సోమవారం గృహ ప్రవేశం చేశారు. ఈ విగ్రహంతో శ్రీనివాస గుప్తా, ఆయన, ఇద్దరు కూతుర్లు  ఫొటోలు దిగారు. - బెంగళూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-08-11T07:29:12+05:30 IST