డబ్బు కోసం తాతను అదృశ్యం చేసిన మనవడు.. అసలు విషయం ఎలా బయటపడిందంటే..

ABN , First Publish Date - 2022-02-28T05:51:21+05:30 IST

ఆ యువకుడు తన తల్లితో కలిసి తాతగారింట్లో నివసించేవాడు. తాతతో డబ్బుల గురించి తరచుగా గొడవపడేవాడు.. తల్లి నెల రోజుల క్రితం వేరే ఊరు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి ఆమె తండ్రి కనిపించలేదు. కొడుకును అడిగితే తనకు తెలియదన్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది కొడుకు మీద అనుమానం వ్యక్తం చేయడంతో...

డబ్బు కోసం తాతను అదృశ్యం చేసిన మనవడు.. అసలు విషయం ఎలా బయటపడిందంటే..

ఆ యువకుడు తన తల్లితో కలిసి తాతగారింట్లో నివసించేవాడు. తాతతో డబ్బుల గురించి తరచుగా గొడవపడేవాడు.. తల్లి నెల రోజుల క్రితం వేరే ఊరు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి ఆమె తండ్రి కనిపించలేదు. కొడుకును అడిగితే తనకు తెలియదన్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది కొడుకు మీద అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది.   


వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో నవాసే అనే యువకుడు తన తాతయ్యతో తరచుగా డబ్బుల కోసం గొడవపడేవాడు. ఆ గొడవ ముదరడంతో తాతయ్యను హత్యచేశాడు. ఆ తరువాత తాత డబ్బులు, బంగారం తీసుకున్నాడు. ఆ సమయంలో నవాసే తల్లి పని మీద వేరే ఊరు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి తండ్రి కనిపించలేదు. నవేసాని అడిగితే.. బ్యాగ్ తీసుకుని తాతయ్య ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పాడు. 


దీంతో తండ్రి కోసం ఆమె ఎంతగానే వెతికింది. అయినా ఎక్కడా కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా, ఇంట్లో నేలపై రక్తపు మరకలు కనిపించడం, చిన్నగా దుర్వాసన వస్తుండడంతో కొడుకుపై అనుమానం వ్యక్తం చేసింది. అదే విషయాన్ని పోలీసులకు చెప్పింది. నవాసేను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నవాసే ఇంట్లోనే తన తాత శవాన్ని పాతిపెట్టాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.  


Updated Date - 2022-02-28T05:51:21+05:30 IST