భర్తకు ఫుల్లుగా మందు తాపించి.. భార్యపై అత్యాచారం చేసిన స్నేహితుడు.. ఆ తర్వాత..
ABN , First Publish Date - 2022-06-10T08:31:46+05:30 IST
పక్క ఊరికి వెళ్తున్న జంటను కలిశాడో వ్యక్తి. అతను భర్తకు స్నేహితుడే కావడంతో ఆమె పెద్దగా పట్టించుకోలేదు. తన బండిపై తీసుకెళ్తానని అనడంతో ఇద్దరూ బండి ఎక్కారు. అయితే వాళ్లు వెళ్లాల్సిన ఊరు కాకుండా వేరే ఊరికి తీసుకెళ్లాడా స్నేహితుడు. అక్కడ భర్తకు ఫుల్లుగా మందు తాపించాడు. అనంతరం భార్యను బలవంతంగా బండిపై ఎక్కించుకొని...
పక్క ఊరికి వెళ్తున్న జంటను కలిశాడో వ్యక్తి. అతను భర్తకు స్నేహితుడే కావడంతో ఆమె పెద్దగా పట్టించుకోలేదు. తన బండిపై తీసుకెళ్తానని అనడంతో ఇద్దరూ బండి ఎక్కారు. అయితే వాళ్లు వెళ్లాల్సిన ఊరు కాకుండా వేరే ఊరికి తీసుకెళ్లాడా స్నేహితుడు. అక్కడ భర్తకు ఫుల్లుగా మందు తాపించాడు. అనంతరం భార్యను బలవంతంగా బండిపై ఎక్కించుకొని, ఊరికి దూరంగా తీసుకెళ్లి బలాత్కరించాడు. ఈ ఘటన రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో వెలుగు చూసింది.
38 ఏళ్ల దళిత మహిళ తన భర్తతో కలిసి మే 23న రాత్రివేళ బాడీ టౌన్కు బయలు దేరింది. దారి మధ్యలోనే భర్త స్నేహితుడు రామ్దీన్ ఎదురయ్యాడు. విషయం తెలుసుకొని తన బండిపై డ్రాప్ చేస్తానని అనడంతో ఇద్దరూ ఆ బండి ఎక్కారు. వాళ్లను బాడీ టౌన్కు కాకుండా హాసయీ గ్రామానికి తీసుకెళ్లిన రామ్దీన్.. మహిళ భర్తకు ఫుల్లుగా మందు తాపించాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా తీసుకెళ్లి ఊరికి దూరంగా ఉన్న అడవిలో అత్యాచారం చేశాడు.
రెండు గంటల తర్వాత భర్త మేలుకోవడంతో.. ఏం మాట్లాడకుండా ఇద్దరినీ తన బండిపై బాడీ టౌన్లో దింపేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు మహిళ ఫిర్యాదు చేయడంతో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసుకున్న అధికారులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.