బైక్ పట్టుకున్నారని పోలీసులపై దాడి చేసిన వ్యక్తి

ABN , First Publish Date - 2021-08-14T08:56:48+05:30 IST

వాహనం పట్టుకుని ఫైన్ వేశారనే కోపంతో ఓ వ్యక్తి పోలీసులపైనే దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడి వాహనాన్ని సీజ్ చేయడమే ..

బైక్ పట్టుకున్నారని పోలీసులపై దాడి చేసిన వ్యక్తి

సూరత్: వాహనం పట్టుకుని ఫైన్ వేశారనే కోపంతో ఓ వ్యక్తి పోలీసులపైనే దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడి వాహనాన్ని సీజ్ చేయడమే కాకుండా అతడిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రజనీకాంత్ సక్సేనా అనే 45ఏళ్ల వ్యక్తి గురువారం తన బైక్‌ను స్థానికంగా ఓ నో పార్కింగ్ ఏరియాలో నిలిపాడు. దీంతో పోలీసులు ఆ వాహనాన్నీ స్వాధీనం చేసుకుని టోవింగ్ వాహనంలోకి ఎక్కించారు. నో పార్కింగ్‌లో పార్క్ చేసినందుకు గానూ పోలీసులు అతడికి రూ.650 ఫైన్ కూడా విధించారు. 


ఈ క్రమంలోనే పోలీసులతో వాగ్వాదానికి దిగిన రజనీకాంత్ ఉన్నట్లుండి పోలీసులపై దాడి చేశాడు. దీంతో అతడిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అతడిపై ప్రభుత్వ ఉద్యోగి కార్యకలాపాలకు భంగం కలిగించడంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా.. సక్సేనా పోలీసులపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2021-08-14T08:56:48+05:30 IST