ద్వారకాతిరుమలలో యువతిపై కర్రతో దాడి

ABN , First Publish Date - 2020-07-09T04:10:46+05:30 IST

ద్వారకాతిరుమలలో ఓ యువతిపై మహేష్ అనే యువకుడు కర్రతో దాడి చేశాడు. కొన్నాళ్లుగా యువతిని..

ద్వారకాతిరుమలలో యువతిపై కర్రతో దాడి

ఏలూరు: ద్వారకాతిరుమలలో ఓ యువతిపై మహేష్ అనే యువకుడు కర్రతో దాడి చేశాడు. కొన్నాళ్లుగా యువతిని పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. బుధవారం కూడా ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయాని నిర్ణయించుకుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న సమయంలో కాపుకాసి ఆమెపై మహేష్ దాడి చేశాడు. అడ్డుకోబోయిన యువతి కుటుంబ సభ్యులపై కూడా దాడికి తెగబడ్డారు. మహేష్ దాడిలో యువతితో పాటు పలువురికి గాయాలయ్యాయి. వారిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


Updated Date - 2020-07-09T04:10:46+05:30 IST