పూరీకి కూర ఇవ్వలేదని దాడి
ABN , First Publish Date - 2022-05-27T11:54:08+05:30 IST
పూరీకి కూర (Curry) ఇవ్వలేదని హోటల్ (Hotel) సిబ్బందిపై దాడి
హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్ : పూరీకి కూర (Curry) ఇవ్వలేదని హోటల్ (Hotel) సిబ్బందిపై దాడి చేశాడో యువకుడు. రహ్మత్నగర్లో హర్షద్ అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం రహ్మత్నగర్కు చెందిన మిరాజ్ హోటల్కు వచ్చి పూరీ ఆర్డర్ ఇచ్చాడు. పనిచేసే నాగేష్ పూరీ తెచ్చి ఇచ్చాడు. ఎక్స్ట్రా కూర కావాలని మిరాజ్ కోరాడు. నాగేష్ కాస్త ఆలస్యం చేయడంతో ఆగ్రహానికి గురైన మిరాజ్ అతడిపై దాడి చేసి గాయపర్చాడు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.