భార్య,మామపై దాడి: ఆరు నెలల జైలు

ABN , First Publish Date - 2022-05-24T06:21:41+05:30 IST

రాజమహేంద్రవరానికి చెందిన మద్దాల జెస్సీ సుప్రియ తనను, తన తండ్రిని భర్త మద్దాల చినబాబు కొట్టి గాయపరిచినట్టు 2017 ఫిబ్రవరి 10న ప్రకాష్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

భార్య,మామపై దాడి: ఆరు నెలల జైలు

రాజమహేంద్రవరం, మే 23(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరానికి చెందిన మద్దాల జెస్సీ సుప్రియ తనను, తన తండ్రిని భర్త మద్దాల చినబాబు కొట్టి గాయపరిచినట్టు  2017 ఫిబ్రవరి 10న ప్రకాష్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పటి ఎస్‌ఐ కె.వెంకన్న కేసు నమోదు చేసి దర్యాప్తుగా చేసి, చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ అనంతరం సోమవారం 2వ ఏజెఎఫ్‌సీఎం కోర్టు న్యాయమూర్తి ఎం.కరీముల్లా నిందితుడు మద్దాల చినబాబుకు 6 నెలలు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరపున అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎస్‌.విజయకుమార్‌ వాదించారు.

Updated Date - 2022-05-24T06:21:41+05:30 IST