తల్లి ఎదురుగానే సవతి తండ్రి ఘాతుకం.. స్నేహితుల ఎదురుగా కూతుళ్ల చేత డ్యాన్స్.. తర్వాత ఒక బాలికను పట్టుకుని..

ABN , First Publish Date - 2022-03-08T22:42:42+05:30 IST

ఆ మహిళ తన కూతుళ్ల పట్ల కర్కశంగా వ్యవహరించింది.. రెండో భర్త మోజులో పడి మద్యం మత్తులో పశువులా ప్రవర్తించింది.. కన్న కూతుళ్లను భర్త వేధిస్తున్నా, ఒక బాలికపై అత్యాచారం చేస్తూన్నా ఏమీ పట్టనట్టు కూర్చుంది.

తల్లి ఎదురుగానే సవతి తండ్రి ఘాతుకం.. స్నేహితుల ఎదురుగా కూతుళ్ల చేత డ్యాన్స్.. తర్వాత ఒక బాలికను పట్టుకుని..

ఆ మహిళ తన కూతుళ్ల పట్ల కర్కశంగా వ్యవహరించింది.. రెండో భర్త మోజులో పడి మద్యం మత్తులో పశువులా ప్రవర్తించింది.. కన్న కూతుళ్లను భర్త వేధిస్తున్నా, ఒక బాలికపై అత్యాచారం చేస్తూన్నా ఏమీ పట్టనట్టు కూర్చుంది. అంతేకాదు తాగి భర్త స్నేహితుల ఎదుట నగ్నంగా చిందులు కూడా వేసింది.. అత్యాచారానికి గురైన బాలిక పోలీసులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలోని నివారు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను, ముగ్గురు కూతుళ్లను ఏడేళ్ల క్రితం వదిలేసి వెళ్లిపోయాడు. రెండేళ్ల అనంతరం ఆమె.. మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. రెస్టారెంట్ ఆపరేటర్ అయిన ఆ వ్యక్తి ఈ నెల 5వ తేదీన తన స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లాడు. భార్య, స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఆమె తన భర్త స్నేహితుల ఎదుట నగ్నంగా డ్యాన్స్ వేసింది. అనంతరం ఇంట్లో ఉన్న ముగ్గురు బాలికలను ఆ సవతి తండ్రి బయటకు తీసుకొచ్చాడు. 


స్నేహితుల ఎదుట వారి చేత అసభ్యంగా డ్యాన్స్ చేయించాడు. తల్లి అక్కడే ఉన్నా అతడిని వారించలేదు సరికదా మరింత ప్రోత్సహించింది. అనంతరం ఆ ముగ్గురిలో పెద్దదైన 17 ఏళ్ల బాలికను సవతితండ్రి పక్క గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ విషయాన్ని ఆ బాలిక తన అమ్మమ్మతో, తాతతో చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-03-08T22:42:42+05:30 IST