Mumbai కార్గో కాంప్లెక్స్‌లో రూ.4కోట్ల హెరాయిన్ స్వాధీనం

ABN , First Publish Date - 2021-11-05T18:02:50+05:30 IST

ముంబై విమానాశ్రయం సమీపంలోని కార్గో కాంప్లెక్స్‌లో 4 కోట్ల రూపాయల విలువ చేసే 700 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న కేసులో గుజరాత్‌కు చెందిన...

Mumbai కార్గో కాంప్లెక్స్‌లో రూ.4కోట్ల హెరాయిన్ స్వాధీనం

నిందితుడు గుజరాత్ వాసి కృష్ణ మురారి ప్రసాద్‌ అరెస్ట్

ముంబై: ముంబై విమానాశ్రయం సమీపంలోని కార్గో కాంప్లెక్స్‌లో 4 కోట్ల రూపాయల విలువ చేసే 700 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న కేసులో గుజరాత్‌కు చెందిన వ్యక్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.ముంబై సబర్బన్‌లోని ఇంటర్నేషనల్ కొరియర్ టెర్మినల్‌లోని పార్శిల్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ యూనిట్‌కు నిర్దిష్ట సమాచారం అందిందని అధికారి చెప్పారు. కాంప్లెక్స్‌లోని సమావేశ మందిరంలో సోదాలు నిర్వహించగా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఒక ప్యాకెట్‌లో 700 గ్రాముల వైట్ పౌడర్‌ను కనుగొన్నారు. 



ఇది హెరాయిన్‌గా భావిస్తున్నారు. దీని విలువ అక్రమ మార్కెట్‌లో సుమారు రూ.4 కోట్లు ఉంటుందని అంచనా. నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద కేసు నమోదు చేశామని, పార్శిల్ సరుకుదారు వడోదర నివాసి కృష్ణ మురారి ప్రసాద్‌ను అరెస్టు ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయంలో వాంగ్మూలం నమోదు చేయడానికి పిలిపించినట్లు ఆయన తెలిపారు. విచారణ అనంతరం ప్రసాద్‌ను అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. 

Updated Date - 2021-11-05T18:02:50+05:30 IST