తుపాకీని అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
ABN , First Publish Date - 2022-04-07T00:20:33+05:30 IST
నగరంలో తుపాకీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని
హైదరాబాద్: నగరంలో తుపాకీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని మియపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న గౌతమ్ కుమార్ ఠాకూర్(24) అనే వ్యక్తి అక్రమంగా తుపాకీ కలిగి వుండి దాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఓటీ, మియపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆటోలో వస్తున్న నిందితుడు గౌతమ్ కునర్ ఠాకూర్ను అపి చెక్ చేశారు. అందులో లైసెన్స్ లేని ఒక కంట్రీ మేడ్ 7.65 పిస్టల్ పోలీసులకు లభ్యమైంది. నిందితుడు అట్టి పిస్టల్ను అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో వెల్లడయింది. నిందితుని వద్ద నుంచి ఒక కంట్రీ మేడ్ 7.65 పిస్టల్, 03 లైవ్ రౌండ్స్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని మియపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.