మాస్క్ ధరించనంటూ పోలీసులపై వీరంగం... వ్యక్తి అరెస్ట్!

ABN , First Publish Date - 2021-04-16T19:54:07+05:30 IST

మాస్క్ ధరించేందుకు తిరస్కరించడంతో పాటు ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు....

మాస్క్ ధరించనంటూ పోలీసులపై వీరంగం... వ్యక్తి అరెస్ట్!

ముంబై: మాస్క్ ధరించేందుకు తిరస్కరించడంతో పాటు ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 11:30 సమయంలో నగరంలోని ములుంద్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తున్న జతిన్ ప్రేమ్‌జీ అనే వ్యక్తి ముంబై ట్రాఫిక్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులను దుర్భాషలాడినట్టు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆర్ఆర్‌టీ రోడ్డులో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు... ‘నో పార్కింగ్ జోన్’ వద్ద వాహనాలు నిలిపిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. అక్కడే జతిన్ ద్విచక్ర వాహనం కూడా ఉండడంతో... అతడికి పోలీసులు జరిమానా విధించారు. దీంతో అతడు పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో పరస్పరం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో కనీసం మాస్కు ధరించేందుకు కూడా నిందితుడు తిరస్కరించాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని పోలీసులు రికార్డు చేశారు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడంతో.. అతడిని వెంటాడి పట్టుకున్నారు. కానిస్టేబుళ్లు ఇచ్చిన లేఖ ఆధారంగా ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-04-16T19:54:07+05:30 IST