అక్రమంగా హోటల్‌ నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2020-07-03T09:53:50+05:30 IST

అనుమతులు తీసుకోకుండా, కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న హోటల్‌పై పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులను

అక్రమంగా హోటల్‌ నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్టు

బంజారాహిల్స్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): అనుమతులు తీసుకోకుండా, కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న హోటల్‌పై పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 78, భరణి లే అవుట్‌, ప్లాట్‌ నంబరు 52లో ఎజాజ్‌, మొయిన్‌ఖాన్‌ సైరా స్కై పేరిట హోటల్‌ నిర్వహిస్తున్నారు. యువతతో పార్టీలు నిర్వహిస్తూ మద్యం సరఫరా చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి వ్యాపారం నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న భరణి లే అవుట్‌ అసోసియేషన్‌ సభ్యుడు సోమ దేవేందర్‌రెడ్డి వాకబు చేయగా... హోటల్‌కు జీహెచ్‌ఎంసీ, మద్యం లైసెన్స్‌ లేదని తెలుసుకున్నాడు. ఆయన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు హోటల్‌పై దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు. 

Updated Date - 2020-07-03T09:53:50+05:30 IST