AP సచివాలయంలో ఉద్యోగం పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
ABN , First Publish Date - 2022-06-16T17:24:55+05:30 IST
రాష్ట్ర సచివాలయంలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తానని లక్షలు దండుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కడప: రాష్ట్ర సచివాలయంలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తానని లక్షలు దండుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 5 నకిలీ ఉద్యోగ నియామక పత్రాలతో పాటు నిందితుడికి సంబంధించి రెండు బ్యాంక్ పుస్తకాలు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ట్రాన్స్కోలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఇద్దరు వ్యక్తుల వద్ద నిందితుడు నలభై లక్షలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బద్వేలు రూరల్ పోలీసులు... నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.