Heart breaking incident: మామడిపండు కావాలని బాలిక ఏడుపు.. మేనకోడలు అని కూడా చూడకుండా ఆ వ్యక్తి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..

ABN , First Publish Date - 2022-07-24T02:40:09+05:30 IST

చిన్న పిల్లలు తరచుగా ఏదో ఒకటి కావాలని మారాం చేస్తుంటారు.. వారు అడిగినవి ఇవ్వలేకపోతే బుజ్జగించి, లాలించి

Heart breaking incident: మామడిపండు కావాలని బాలిక ఏడుపు.. మేనకోడలు అని కూడా చూడకుండా ఆ వ్యక్తి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..

చిన్న పిల్లలు తరచుగా ఏదో ఒకటి కావాలని మారాం చేస్తుంటారు.. వారు అడిగినవి ఇవ్వలేకపోతే బుజ్జగించి, లాలించి వారికి తల్లిదండ్రులు నచ్చ చెబుతుంటారు.. చిన్న పిల్లల విషయంలో ఎంతో ఓర్పు సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది.. అయితే మామడిపండు (Mango) కోసం బాలిక ఏడుస్తుండడాన్ని విని చిరాకు పడిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.. ఓ ఇనుప రాడ్డుతో చిన్నారి తల పగలగొట్టి చంపేశాడు..  ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Viral News: కోడి పుంజుకు ఘన నివాళి.. దశదినకర్మ జరిపించి 500 మందికి భోజనాలు.. కన్నీళ్లు పెట్టుకున్న యజమాని..


లక్నోకు సమీపంలోని ఖేడా కుర్‌తార్‌ గ్రామానికి చెందిన ఉమర్‌దీన్‌ అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం భోజనం చేస్తుండగా అతని ఐదేళ్ల మేనకోడలు (niece) నిషా మామిడిపండు కోసం ఏడవడం ప్రారంభించింది. తీవ్ర అసహనానికి గురైన ఆ వ్యక్తి ఓ ఇనుప రాడ్డుతో నిషా తలపై కొట్టాడు. ఆ తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు. బాలిక మృతదేహాన్ని సంచిలో చుట్టి ఇంట్లోనే దాచాడు. నిషా కన్పించకపోయేసరికి తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఉమర్‌దీన్‌ కూడా వారితో కలిసి పాపను వెతుకుతున్నట్లు నటించాడు. కూతురి ఆచూకీ లభించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వారికి ఉమర్‌దీన్‌పై  అనుమానం వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న నిందితుడు గ్రామం వదిలి పారిపోయాడు. నిందితుడి ఇల్లు వెతికిన పోలీసులకు ఓ సంచిలో బాలిక మృతదేహం లభించింది. పోలీసులు నిందితుడి కోసం గాలించి గురువారం రాత్రి ఓ అడవి సమీపంలో అరెస్టు చేశారు. 


Updated Date - 2022-07-24T02:40:09+05:30 IST