అదృశ్యమైన ఆరు నెలల తర్వాత ఇంటికి చేరిన 85 ఏళ్ల వృద్ధుడు

ABN , First Publish Date - 2020-07-12T23:28:57+05:30 IST

మతిమరుపుతో బాధపడుతున్న 85 ఏళ్ల వృద్ధుడు ఇంటి నుంచి అదృశ్యమైన ఆరు నెలల తర్వాత తిరిగి

అదృశ్యమైన ఆరు నెలల తర్వాత ఇంటికి చేరిన 85 ఏళ్ల వృద్ధుడు

న్యూఢిల్లీ: మతిమరుపుతో బాధపడుతున్న 85 ఏళ్ల వృద్ధుడు ఇంటి నుంచి అదృశ్యమైన ఆరు నెలల తర్వాత తిరిగి కుటుంబం చెంతకు చేరుకున్నాడు. డిల్లీలో జరిగిందీ ఘటన. ఆగ్నేయ ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతానికి చెందిన తన తండ్రి దేవ్ నారాయణ్ ఝా కనిపించకుండా పోయాడంటూ ఆయన కుమారుడు ప్రభాకర్ ఝా ఈ ఏడాది జనవరి 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక విభాగానికి సంగం విహార్ ప్రాంతంలో ఓ వృద్ధుడు చాలా కాలంగా ఉంటున్నట్టు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు బృందం  నారాయణ్ ఝా ఫొటోను అక్కడికి వారికి చూపించి గుర్తిస్తే చెప్పాలని సూచించింది. ఈ క్రమంలో శనివారం సంగం విహార్ ప్రాంతంలో ఉన్న వృద్ధుడిని గుర్తించి ఇంటికి తీసుకెళ్లి అప్పగించినట్టు డీసీపీ (సౌత్ ఈస్ట్) ఆర్‌పీ మీనా తెలిపారు.   

Updated Date - 2020-07-12T23:28:57+05:30 IST