ధరలను పెంచి బీజేపీ లూటీ చేస్తోంది : మమత ఫైర్

ABN , First Publish Date - 2021-03-07T21:32:26+05:30 IST

బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ సభను నిర్వహిస్తుండగా, దానికి పోటీగా సీఎం మమత బెనర్జీ నిరసన కార్యక్రమాన్ని

ధరలను పెంచి బీజేపీ లూటీ చేస్తోంది : మమత ఫైర్

కోల్‌కతా : బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ సభను నిర్వహిస్తుండగా, దానికి పోటీగా సీఎం మమత బెనర్జీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరిగిన సిలిండర్ ధరలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తూ నిరసనను వ్యక్తం చేశారు. అధికార బీజేపీ ప్రజలను దోచుకుంటోందని మండిపడ్డారు. పెరిగిన ధరలు మోదీ దృష్టికి తీసుకురావడానికే తాము ఈ ర్యాలీని నిర్వహించామని, ప్రస్తుతం మోదీ బెంగాల్ పర్యటనలోనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. పెట్రో, సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దీనికి మోదీ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. మోదీ కేవలం మాటలు మాత్రమే చెబుతారని ఎద్దేవా చేశారు. బెంగాల్‌లో మార్పు రావాలని మోదీ పదే పదే అంటారని, కేంద్రంలో పరివర్తన వస్తుందని, మోదీ కుర్చీ నుంచి గద్దె దిగుతారని ఆమె రివర్స్ కౌంటర్ ఇచ్చారు. బెంగాల్‌లో మహిళలు అత్యంత సురక్షితంగా ఉన్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పరిస్థితులు బాగోలేవని విమర్శించారు.

Updated Date - 2021-03-07T21:32:26+05:30 IST