హైకోర్టులో మమతకు చుక్కెదురు
ABN , First Publish Date - 2021-06-22T06:52:13+05:30 IST
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసకు సంబంధించిన వివాదం రోజురోజుకూ
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసకు సంబంధించిన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. అల్లర్లపై విచారణకు సంబంధించి కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. హింసకు సంబంధించి గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అదే హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఏసీజే రాజేశ్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
కాగా, ముఖ్యమంత్రి మమత ప్రత్యేక సలహాదారు అలపన్ బంద్యోపాధ్యాయ్పై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు కేంద్రం నోటీసు పంపింది. వివరణ ఇచ్చేందుకు ఆయనకు నెల రోజుల గడువిచ్చింది.